మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు

Mar 19 2026 7:43 AM | Updated on Mar 19 2026 7:43 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement