ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం రైతులకు అనేక రాయితీలు అందిస్తోంది. రూ.193 విలువైన ఒక్కో మొక్కను కేవలం రూ.20కే అందించి.. మిగిలిన రూ. 173ను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తోంది. వీటితో పాటు ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ. 2,100 చొప్పున నిర్వహణ కోసం అందిస్తుంది. అదే విధంగా అంతర పంటలు సాగుచేస్తే మరో రూ. 2,100 వరకు అదనంగా చెల్లిస్తుంది. 12 ఎకరాల వరకు డ్రిప్ సౌకర్యాలను సబ్సిడీ ద్వారా అందిస్తుంది. పండించిన పంటను ఆయిల్ కంపెనీలే కొనుగోలు చేసేలా బై–బ్యాక్ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు మద్దతు ధర ప్రకటించి.. రైతులకు కొండంత అండగా నిలుస్తుంది.


