పోరాటం ఆపొద్దు..! | - | Sakshi
Sakshi News home page

పోరాటం ఆపొద్దు..!

Feb 26 2026 8:32 AM | Updated on Feb 26 2026 8:32 AM

పోరాటం ఆపొద్దు..!

పోరాటం ఆపొద్దు..!

పాప చనిపోతే హత్య కేసు కాదా? సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం..

బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం

మానవత్వానికి మాయని మచ్చగా

దాడి ఘటన

రెండు నెలల పసిపాపపై ఇంత

క్రూరత్వమా?

ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు

‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని

పరామర్శించిన కేటీఆర్‌

కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు.

ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మహేంద్రనాథ్‌తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement