
ఉత్సాహంగా నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల రాష్ట్రస్థాయి బాల, బాలికల నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి టోర్నమెంట్లకు సంబంధించి రాష్ట్రంలోని పలుచోట్ల సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక కోచింగ్ క్యాంపులు నిర్వహించి ప్రతిభచాటిన వారిని తుది రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్య, సాదత్ఖాన్, ఖాజాఖాన్, అంజద్అలీ, షరీఫ్, షకీల్, అక్రం పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యలు
పరిష్కరించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామదాసు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు అధికారంలోకి వచ్చిన తక్షణమే పరిష్కరిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ కరువు భత్యాల మంజూరు, పీఆర్సీ అమలు చేయకపోవడం, ఈ–కుబేర్లో బిల్లులు పెండింగ్లో ఉండటం ఇలా అనేక సమస్యలతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన వారి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, ఎల్ఎఫ్ ఇతర ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించాలన్నారు. వీటిపై ప్రభుత్వ స్పందన లేకపోవడంతోనే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. మూడో దశ పోరాటంలో భాగంగా నిర్వహించే ధర్నాలో పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. మెలికలు పెట్టకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చి బీసీల సాధికారతకు, జీవనోపాధికి దోహదపడాలన్నారు. బీసీలు అంకితభావంతో సమకాలీన రాజకీయాలను గమనిస్తూ మన ఓటు మనకే అన్న నినాదంతో పోటీ చేయకుండా బీసీలకే వేసుకొని రాజ్యాధికారం సాధించాలన్నారు. సమావేశంలో ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి బ్రహ్మయ్యచారి, బీసీ సంఘటన సమితి ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంశ్రీనివాస్, అంజయ్య, లక్ష్మీనారాయణయాదవ్, రజక సంఘం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మశాలీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్, బవసార్ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, వీరశైవ సంఘం అధ్యక్షుడు సిద్ధిరామప్ప, మహేంద్ర సంఘం అధ్యక్షుడు రాములు, నాయీ బ్రాహ్మణ అధ్యక్షుడు సత్యం, సంఘాల నాయకులు హరిప్రకాష్గౌడ్, సుబ్రహ్మణ్యం, రాజసింహుడు, నర్సింహ, కందమూరి, మంజుల, ఉమామాధవి, రమాదేవి, పుష్ప, రాధ పాల్గొన్నారు.

ఉత్సాహంగా నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్