
జిల్లా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు ప్రారంభం
గద్వాల క్రైం: రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ సంతోష్కుమార్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలోని నూతనంగా మంజూరైన సిటీ స్కాన్ మిషన్ను వారు ప్రారంభించి మాట్లాడారు. రోగ నిర్ధారణ సేవలు వేగవంతం కానున్నాయని, వివిధ సందర్భాల్లో రోగులకు అత్యాధునిక స్కానింగ్ పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకునేవారని అన్నారు. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రిలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, రూ.2.5 కోట్లు సిటీ స్కాన్ నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రిలో సేవలు కల్పించడం జరిగిందన్నారు. రోగులు, గర్భిణుల సమస్యలను గుర్తించి సత్వర సేవలు అందించడం ఇక నుంచి సులువవుతుందని వివరించారు. అనంతరం సిటీ స్కాన్ మిషన్ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిరా, ఆర్ఎం విగ్నేష్ సిబ్బంది ఉన్నారు.
పకడ్బందీగా పోషణ్ పక్వాడ
గద్వాల: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షించారు. పోషణ్ పక్వాడ 2025ను ఏప్రిల్ 8–22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల అభివృద్ధిలో అత్యంత కీలకమైన వెయ్యి రోజులు గర్భాధారణ ప్రారంభం నుంచి రెండవ పుట్టినరోజు వరకు ప్రత్యేక దృష్టి సారించబడుతుందన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమరదశలో ఉన్న బాలికలలో బలహీనంగా, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపంతో ఉన్న గర్భిణులు వి వరాలను సేకరించి వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సి ంగ్రావు, సంక్షేమశాఖ జిల్లా ఽఅధికారి సునంద, వివి ధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.