భూపాలపల్లి అర్బన్: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పట్టణంలోని సీఆర్ నగర్కాలనీకి చెందిన పావనపు రాజు (డ్రైవర్), నీలుగొండ రమేష్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును పోలీస్ స్టేషన్కు అప్పగించారు.


