పింఛన్‌ జారీ ఇక ఈజీ | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ జారీ ఇక ఈజీ

Aug 7 2025 7:18 AM | Updated on Aug 7 2025 9:30 AM

పింఛన

పింఛన్‌ జారీ ఇక ఈజీ

భూపాలపల్లి రూరల్‌: ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్‌ రికగ్నైజేషన్‌ (ముఖ గుర్తింపు) విధానంలో అందజేయనున్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రల (బయోమెట్రిక్‌) ఆధారంగా పింఛన్లు ఇస్తున్నారు. ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రభుత్వం ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ, సులభంగా పింఛన్‌ అందజేసేలా రికగ్నైజేషన్‌ యాప్‌ ద్వారా ఫొటోలు తీసి, అప్లోడ్‌ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెలలో పోస్టాఫీస్‌, బీపీఎంలకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌తో కూడిన సెల్‌ఫోన్లు అందజేశారు. ఈనెల నుంచే ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు.

వేలిముద్రతో ఇబ్బందులు..

ఇదివరకు పింఛన్‌ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్‌ కాకపోవడంతో వారు పింఛన్‌ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.. మరోవైపు ఐరిష్‌లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికారులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొండుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు.

సులభంగా అందేలా..

బయోమెట్రిక్‌ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌లో బీపీఎంలు.. పింఛన్‌దారుల పేర్లు, వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. యాప్‌ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్‌దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్‌ చెల్లించినట్లు నమోదు చేసి, నగదు అందజేస్తారు. నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వారికి చివరి రోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతి లద్ధిదారుడికి సులభంగా పింఛన్‌ అందనుంది.

బీపీఎంలకు శిక్షణ

పింఛన్ల పంపిణీలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని ప్రభుత్వం అమలు చేప్తోంది. ఈనెలలో ఇచ్చే పింఛన్లకు కొత్త విధానాన్ని వర్తింపజేస్తున్నాం. జిల్లాల్లోని బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్లకు (బీపీఎం) ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన మొబైల్స్‌ ఇచ్చారు. ఆ యాప్‌ను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

– బాలకృష్ణ, డీఆర్డీఓ, భూపాలపల్లి

జిల్లాలో ఇలా..

పింఛన్‌ రకం లబ్ధిదారులు

వృద్ధాప్య 21,040

వితంతు 19,243

వికలాంగులు 5,600

కల్లుగీత 1,364

చేనేత 778

పైలేరియా 38

డయాలసిస్‌ 51

బీడీ కార్మికులు 38

ఒంటరి మహిళలు 1,075

మొత్తం లబ్ధిదారులు 49,227

ముఖ గుర్తింపుతో పింఛన్‌

బయోమెట్రిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేలా

ఫేస్‌ రికగ్నైజేషన్‌

బీపీఎంలకు సెల్‌ ఫోన్లు అందజేసిన

ప్రభుత్వం

ఈనెల నుంచే కొత్త విధానంలో

పింఛన్ల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా 49,227 మంది

పింఛన్‌దారులు

పింఛన్‌ జారీ ఇక ఈజీ 1
1/1

పింఛన్‌ జారీ ఇక ఈజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement