● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
రంజిత్కుమార్
స్టేషన్ఘన్పూర్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్కుమార్ ఆరోపించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామసమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు అంజిరెడ్డి, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, లలితాకుమారి, శాంతి, శ్రీనివాస్, సోమరాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


