● సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్
జనగామ రూరల్: ఖైదీలకు చట్టాలపై అవగాహన అవసరమని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్జైలును సందర్శించిన ఆయన.. ఖైదీలకు కల్పించిన వసతులు, భోజనం, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నా రు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారా లేదా.. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ప్రతీ ఖైదీకి న్యాయవాదులు ఉండాలని, ములాఖత్ ఫిర్యాదులుంటే చెప్పాలని సూచించారు. కంప్లైట్ బాక్స్లో సమస్యలు రాసి వేయాలని చెప్పా రు. బెయిల్ గ్రాంట్ అయి విడుదల కానివారుంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకురావాలి ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కృష్ణ కాంత్కు సూచించారు.