ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలి

మాట్లాడుతున్న రమేష్‌కుమార్‌ - Sakshi

జనగామ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగే ధర్నా పోస్టర్‌ను మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణకు చొరవ తీసుకోవాలన్నారు. నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోళ శోభన్‌ బాబు, మహాజన పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బైరురాజు మల్లేశం, నాయకులు బి.వెంకటస్వామి, కొయ్యడ వెంకటస్వామి, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top