జేఎన్టీయూకు అనుబంధంగా కొండగట్టులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకార వేతనాలు రాని విద్యార్థులు నేరుగా హాస్టల్కు చెల్లించే ఫీజులు కాలేజ్ అకౌంట్ కాకుండా యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగి అకౌంట్కు వెళ్లడంపై పూర్తి విచారణ జరగాలి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జేఎన్టీయూలో పెద్దస్థాయి అధికారి అండ ఉంటేనే ఈ విధంగా చేయగలుగుతాడు. కేవలం ఏడాది ఫీజులపై కాకుండా గత మూడు విద్యా సంవత్సరాలు జరిగిన ఫీజుల లావాదేవీలపై విచారణ జరిపించాలి. అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– మణికంఠ రెడ్డి,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు


