బావిలో పడ్డా బతికారు | - | Sakshi
Sakshi News home page

బావిలో పడ్డా బతికారు

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

ఎదురుగా వచ్చిన బైక్‌

తప్పించబోయి అదుపుతప్పిన మరోబైక్‌

రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లిన వైనం

ఇద్దరు చిన్నారులు సహా బావిలో పడ్డ వ్యక్తి

భారీశబ్దం రావడంతో స్పందించి కాపాడిన రైతులు

బాలికను బయటకు తీసుకొస్తున్న స్థానికులు

బైక్‌పడిన వ్యవసాయ బావి

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో సోమవారం ఓ బైక్‌ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థినులు, బైక్‌ నడిపించే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్‌ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్‌ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్‌లోని కేజీబీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్‌పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్‌ శివారులో ఎదురుగా మరోబైక్‌ రావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్‌ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement