బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు తాగించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శిశువుకు సరిపడా పాలు పడేందుకు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. వారోత్సవాల్లో భాగంగా ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.
– భాస్కర్ జిల్లా సంక్షేమ అధికారి
సరైన ఆహారం ముఖ్యం
గర్భం దాల్చినప్పటి నుంచే మహిళ పోషకాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే పసిపాపలకు డబ్బా పాల అవసరమే రాదు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పని సరిగా ముర్రుపాలు తాగించాలి. అప్పుడే బిడ్డ సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.
– డాక్టర్ స్నేహ, ప్రొఫెసర్,
ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల


