గోవులను హతమార్చొద్దు. జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఆవులను రక్షించాలని దేశవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. జిల్లా ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించండి.
– హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి
జగిత్యాలరూరల్ మండలం తిమ్మాపూర్ శివారు సర్వే నంబర్ 77/4లో 20గుంటల స్థలాన్ని ఇమ్మడి లచ్చయ్య నుంచి మా తాత మెరుగు దేవయ్య 1989లో కొన్నాడు. పట్టా చేయాలని కోరితే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల ఆ భూమిని ఆయన కుమారుడు ధర్మయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన మరో వ్యక్తికి విక్రయించి పట్టా చేశాడు. ఆ రిజిస్ట్రేషన్ను రద్దు పరిచి మాకు న్యాయం చేయండి.
– మెరుగు ఉమేశ్, తిమ్మాపూర్


