జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: మొన్న కేసీఆర్ను తిట్టి నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జీవన్రెడ్డి తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బోర్నపల్లి, జగన్నాథపూర్ బ్రిడ్జి విషయంలో మంత్రి లక్ష్మణ్కుమార్ను కలిసి వినతిపత్రం ఇస్తే జీవన్రెడ్డికి ఏం బాధ అన్నారు. 2012లోనే బోర్నపల్లి బ్రిడ్జికి రూ.కోటి మంజూరయ్యాయని చెప్పిన ఆయన.. ఆ నిధులు ఏమయ్యా యో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వాణి పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వరి సాగు చేయొద్దని తెలిపారు. పొలాస రైతు వేదికలో విత్తనమేళా నిర్వహించారు. తక్కువ కా లంలో చేతికొచ్చే పంటలు సాగు చేయాలన్నారు.


