ఇది విద్యార్థులకు మంచి అవకాశం. అందుబాటులో ఉన్న కేజీబీవీల్లో అడ్మిషన్ తీసుకోవాలి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలల్లో త్వరలో వసతులు కల్పిస్తాం. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటవుతాయి. నాణ్యమైన విద్య అందుతుంది.
– రాము, డీఈవో
పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికే..
పేద విద్యార్థులకు ఉచితంగా అన్ని వసతులతో కూడిన విద్యనందిస్తోంది. కేజీబీవీల్లో 6వ తరగతి నుంచే జేఈఈ, నీట్, క్లాట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి మూడు పాఠశాలలను ఎంపిక చేశాం. సద్వినియోగం చేసుకోవాలి. – సత్యప్రసాద్, కలెక్టర్


