వరి సాగును సాధ్యమైనంతగా తగ్గించాలి. రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయడం కష్టంగా మారే అవకాశం ఉంది. రైతులు ఇప్పటి నుంచే ఇతర పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. ఆయా పంటల సాగు గురించి రైతులకు శిక్షణ ఇస్తాం.
– వడ్డేపల్లి భాస్కర్, డీఏవో, జగిత్యాల
పండ్లతోటలను తొలగించి వరి వైపు వెళ్లడం ద్వారా రైతులకు నష్టం జరుగుతుంది. మామిడి వంటి పండ్లతోటను సరిగ్గా ప్రూనింగ్ చేస్తే, మంచి దిగుబడి వస్తుంది. ఆయిల్ పాం గెలలకు మంచి రేటు ఉంది. తొందరపడి పండ్లతోటలను తొలగించవద్దు.
– కట్ట లత, ఉద్యానశాఖ అధికారి, జగిత్యాల


