వెల్గటూర్: మండల కేంద్రంలోని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో
ఎల్లమ్మ పట్నాల ఉత్సవం నిర్వహించారు. మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు బైండ్ల వారి పాటలు, జమిడిక మోతలు, డప్పు చప్పుళ్లతో, మహిళలు బోనాలు ఎత్తుకొని వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమం చివరలో 11 మంది గౌడ సంఘం సభ్యులు ఒకే తాటిచెట్టు పైకి ఎక్కి చేతులతో కల్లు కిందకు దింపి అమ్మవారికి సమర్పించారు.


