
తవ్వారు.. వదిలేశారు
జగిత్యాల: జిల్లా కేంద్రమైన జగిత్యాలలో సుమారు లక్షకుపైగా జనాభా ఉంటుంది. ప్రతి కాలనీల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. ప్రతి వార్డులో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసిన తర్వాత రెండు నెలలు, అనంతరం తవ్వి వదిలేసి మరో రెండు నెలలకు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలకు సంకటంగా మారింది. సీసీరోడ్డు నిర్మాణంలో రెండుమూడు రోజుల్లో పూర్తి చేయవచ్చు. కానీ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదట హడావుడి పనులు మొదలుపెడుతూ పొక్లెయిన్ సహాయంతో రోడ్డంతా తవ్వి దాంట్లో కొద్దిపాటి కంకర పోసి వదిలేస్తున్నారు. నెలల తరబడి ఆపుతున్నారు. దీంతో వాహనాలు వెళ్లాలన్నా, మహిళలు నడవాలన్నా, విద్యార్థులు స్కూల్కు వెళ్లాలన్నా ఆ రో డ్డులో ఇబ్బందికరంగా మారింది. నిబంధనల ప్రకా రం రోడ్డు మొదలుపెట్టిన తర్వాత వెనువెంటనే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా
‘సారూ.. పనులు మొదలుపెట్టడం లేదు. ఇబ్బందులు అవుతున్నాయి. ఎటూ వె ళ్లలేని పరిస్థితి ఉంది..’ అని కాలనీ చెందిన ప్రజలు సంబంధిత ఏ ఈ, డీఈ, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇది కాంట్రాక్టర్కు కూడా అలుసుగా మారింది. పనులు అగ్రిమెంట్ అయిన తర్వాత 3 నుంచి ఆర్నెళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్డు మొదలుపెట్టి వారాలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మొదలు పెట్టిన రో డ్లను పూర్తి చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆయా కా లనీవాసులు కోరుతున్నారు.
రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం
పట్టింపులేని అధికారులు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
నాణ్యత
కరువే
ఇది జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో సీసీరోడ్డు నిర్మాణం కోసం దాదాపు రెండు నెలల క్రితం తవ్వారు. కాంట్రాక్టర్ మరిచిపోయాడు. దీంతో ఆ కాలనీలోని ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి వాహనాలు తీసుకెళ్దామన్నా.. ఆ రోడ్డు వెంట తాగునీరు తీసుకుని మహిళలు వెళ్లాలన్నా.. స్కూళ్లకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు.
సీసీ రోడ్డు మొదలుపెట్టకముందు దానిపై పొక్లెయిన్తో లేయర్ తీసిన అనంతరం కంకర పోయాల్సి ఉంటుంది. కానీ కొంత మంది కాంట్రాక్టర్లు ఏకంగా చెత్తాచెదారం పోసి నింపుతున్నారు. కనీసం అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో ఫిర్యాదు చేస్తే మళ్లీ దానిని తీసివేయడం, చిన్నపాటి కంకరపోస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్లు, అధికారులు నాణ్యతతో నిర్మించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

తవ్వారు.. వదిలేశారు

తవ్వారు.. వదిలేశారు