బెంచి మీద కూర్చుందని అరెస్ట్‌ చేశారు | Police Arrested Women For Sitting In The Bench And Breaking Lock Down Rules | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు

Jan 10 2021 1:44 PM | Updated on Jan 10 2021 4:24 PM

Police Arrested Women For Sitting In The Bench And Breaking Lock Down Rules - Sakshi

వీడియో దృశ్యాలు

శనివారం సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను...

లండన్‌ :  బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్‌ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తూ గత బుధవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నింబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ సారి హెచ్చరించటం.. వినకపోతే ఫైన్‌ వేయటం.. అప్పటికీ వినకపోతే అరెస్ట్‌ చేయటం మొదలుపెట్టారు. ( యూఎస్‌: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం )

శనివారం సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఓ వ్యక్తికి 200 స్టెర్లింగ్‌ పౌండ్ల ఫైన్‌ వేశారు. ప్రీతీ పాటెల్‌ అనే మహిళను హెచ్చరించి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement