భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి మీ పనే’.. | Pakistan Blames India For Pakistani military convoy incident in Khyber Pakhtunkhwa | Sakshi
Sakshi News home page

భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి మీ పనే’..

Jun 29 2025 8:56 AM | Updated on Jun 29 2025 12:16 PM

Pakistan Blames India For Pakistani military convoy incident in Khyber Pakhtunkhwa

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 13మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనను పాకిస్తాన్‌ భారత్ పైకి నెట్టేసింది. తమ దేశ సైనికుల మరణానికి భారత్‌ కారణమని ప్రచారం చేస్తోంది. అయితే, పాక్‌ ప్రచారాన్ని భారత్‌ ఖండించింది. పాక్‌ చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. 

జూన్‌ 28న  పాక్‌ ఉత్తర వజీరిస్తాన్ జిల్లా  ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని ఓ అగంతకుడు  పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీ కొట్టారు. ఈ  ఘటనలో 13మంది ఆర్మీ సైనికులు మరణించగా..10 మంది గాయాలయ్యాయి. 13 మంది సాధారణ పౌరులు గాయపడినట్లు ప్రముఖ పాక్‌ మీడియా సంస్థ డాన్‌ తెలిపింది.  

 

ఈ దాడి వెనక భారత్‌ ఉందంటూ పాకిస్తాన్‌ అధికారంగా చేసిన ప్రకటనను ఖండించింది. వజీరిస్తాన్‌లో పాక్‌ ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్‌ ప్రమేయం ఉందని పాక్‌ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ఆమోదయోగ్యం కాదని..విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

పాక్‌ మీడియా ఏమంటోంది 
దక్షిణ వజీరిస్తాన్‌లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల  ప్రకారం, 2021లో కాబూల్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి  వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకొని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్‌ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు.  

కాగా,ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement