
క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లో 900లకు పైగా రష్యా డ్రోన్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. తమ దేశంపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించిన జెలెన్ స్కీ.. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరిపినా దాడులు ఆగడం లేదంటూ మండిపడ్డారు. రష్యాను కట్టడి చేయాలని.. అమెరికా, యూరప్లు కఠిన ఆంక్షలు విధించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, ఉక్రెయిన్పై శనివారం రాత్రి నుంచి మొదలుకుని సోమవారం ఉదయం దాకా రష్యా భారీ వైమానికి దాడులకు పాల్పడింది. యుద్ధం మొదలైన ఈ మూడేళ్లలో అతి పెద్ద వైమానిక దాడులు ఇవే! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇష్టమొచ్చినట్టు మనుషులను చంపుకుంటూ పోతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని పుతిన్ చూస్తే అది అంతిమంగా రష్యా పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన తన దేశానికి మేలు చేసేలా మాట్లాడటం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా సమస్యలను సృష్టిస్తోంది. నాకది నచ్చడం లేదు. జెలెన్స్కీ మాట్లాడకపోవడమే మంచిది’’అని తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు.