బెర్లిన్: ఈ ఏడాది నమోదైన ఎండలు యూరప్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎండల వేడిమికి తట్టుకోలేక ఐరోపా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ మరణాలు జర్మనీలో సైతం అత్యధికంగా ఉన్నాయి. తాజాగా ఈ వేసవి వడగాలుల వల్ల ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య జర్మనీ అధికారికంగా ప్రకటించింది.
యూరప్లో సంభవించిన తీవ్రమైన వేసవి వడగాలుల వల్ల జర్మనీలో రికార్డు స్థాయిలో 16,300 మరణాలు నమోదయ్యాయని ఈ రోజు గురువారం జర్మనీ అధికారికంగా గణాంకాలు విడుదల చేసింది. గత వారం రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ నివేదించిన 15,800 మరణాల సంఖ్య కంటే ఈ సంఖ్య అధికంగా ఉందని తెలిపింది. ఈ మరణాలు జూన్ 1 నుండి ఆగస్టు 23 వరకూ సంభవించినవిగా తెలిపింది.
అయితే ఈ మరణాలలో అధికంగా 75 ఏళ్లు పైబడిన వారి వయస్సు వారే ఉన్నారని పేర్కొంది. వీటిలో కేవలం జూన్ 22-28 మధ్య కేవలం ఒక వారంలోనే 9,600 మరణాలు సంభవించాయని ఆ సంస్థ అంచనా వేసింది. కాగా గత దశాబ్ద కాలంగా మరణాల డేటా సేకరిస్తున్నామని వాటిలో ఈ సారి అత్యధికంగా మరణాలు సంభవించినట్లు పేర్కొంది. 2018లో ఎండల ద్వారా మరణాల సంఖ్య 8,900గా ఉండగా 1994లో 10 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డట్లు తెలిపింది.


