భారత పర్యటనకు జర్మన్ ఛాన్స్‌లర్..! | German Chancellor Friedrich Merz will visit India on this january | Sakshi
Sakshi News home page

German Chancellor: భారత పర్యటనకు జర్మన్ ఛాన్స్‌లర్..!

Jan 5 2026 11:27 PM | Updated on Jan 5 2026 11:27 PM

German Chancellor Friedrich Merz will visit India on this january

జర్మన్ ఛాన్స్‌లర్‌ ఫ్రీడ్రిక్ మెర్జ్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరును సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇది ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ మొదటి అధికారిక పర్యటన కానుంది.

ఈ జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి, ఛాన్సలర్ మెర్జ్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశం-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలలో సాధించిన పురోగతిని ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి  రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో రక్షణ, భద్రత, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, పరిశోధన, పర్యావరణ, సుస్థిర అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ వ్యాపార, పారిశ్రామిక నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. అత్యున్నత రాజకీయ స్థాయిలో జరిగే సంభాషణల ద్వారా ఈ పర్యటన మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇది ఇరు దేశాల ప్రజలకు, విస్తృత ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా భవిష్యత్ దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించాలనే భారతదేశం, జర్మనీ సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement