
జనాభాను పెంచుకునేందుకు చైనా కొత్త ప్లాన్
బీజింగ్: జననాల రేటు ఏటికేడు పడిపోతుండటంపై చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి బెంగపట్టుకుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతోంది. అందుకే, కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు నెలకు 3,600 యువాన్లు(సుమారు రూ.42 వేలు) అందిస్తామని ప్రకటించింది.
ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.12 లక్షలను చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పథకంపై భారీ ఎత్తున ప్రచారం చేస్తోందని బ్లూమ్బర్గ్ తెలిపింది. చైనా ప్రభుత్వం దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానానికి 2016లో ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా దంపతులు ఒకరికి మించి సంతానాన్ని కనేందుకు మొగ్గు చూపక పోవడంతో చైనా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.