28 కేజీల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

28 కేజీల గంజాయి పట్టివేత

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

నర్సంపేట రూరల్‌ : ఒడిశా నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. ఈనెల 05వ తేదీన ఒడిశాకు చెందిన బోలెరో వాహనంలో భద్రాచలం, మహబూబాబాద్‌, నర్సంపేట మీదుగా హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై గూడ అరుణ్‌, సిబ్బంది నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్‌ బైపాస్‌ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని నిలిపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురులో ఒకరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో వాహనం కింది భాగంలో సుమారు రూ. 14లక్షల విలువైన 28 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వెంటనే గంజాయితోపాటు వాహనాన్ని సీజ్‌ చేసి నర్సంపేట తహసీల్దార్‌ రవిచంద్ర ఆధ్వర్యంలో పంచానామా నిర్వహించి, కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారిలో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అమృత బైద్యాయ్‌, పుజూర్‌ రాయ్‌ ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకున్న ఎస్సై అరుణ్‌, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

ఇద్దరి అరెస్ట్‌, రిమాండ్‌

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement