నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం

Apr 29 2025 7:10 AM | Updated on Apr 29 2025 7:10 AM

నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం

నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం

పెదకాకాని: శివాలయంలో అన్నదాన పథకానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని శివాలయం డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ అన్నారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు కొరిటెపాడుకు చెందిన పూనూరు బసివిరెడ్డి, శైలజ దంపతులు రూ.1,11,116 అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని పూనూరు మాలకొండారెడ్డి జ్ఞాపకార్థం ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌కు అందజేశారు. డీసీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement