
నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం
పెదకాకాని: శివాలయంలో అన్నదాన పథకానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని శివాలయం డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ అన్నారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు కొరిటెపాడుకు చెందిన పూనూరు బసివిరెడ్డి, శైలజ దంపతులు రూ.1,11,116 అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని పూనూరు మాలకొండారెడ్డి జ్ఞాపకార్థం ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్కు అందజేశారు. డీసీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు.