కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

Jan 1 2026 11:09 AM | Updated on Jan 1 2026 11:09 AM

కోర్ట

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌ 3న అమరేశ్వరునికి అన్నాభిషేకం ప్రతి ఎకరాకు సాగు నీరు రామనామంతో శోభాయాత్ర

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా బుధవారం కోర్టు భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో స్థల వివరాలు, భవిష్యత్‌ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొప్పూడి సమీపంలోని జాతీయ రహదారికి సంబంధించి ట్రంపెట్‌ జంక్షన్‌ను పరిశీలించారు. హైవే సర్వీసు రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. పురుషోత్తమపట్నం గ్రామస్తుల వినతి మేరకు గ్రామం నుంచి కోటప్పకొండ ప్రభలు వెళ్లేందుకు అనువుగా సర్వీసు రోడ్డు విస్తీర్ణం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్‌ షేక్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పి. శ్రీహరిబాబు పాల్గొన్నారు.

అమరావతి: అమరావతిలోని శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరునికి శనివారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ధనుర్మాసంలో స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దాతల సహకారంతో సుమారు రెండు క్వింటాళ్లకుపైగా బియ్యాన్ని వండి స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారన్నారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు బ్రాంచి కెనాల్‌ ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఇరిగేషన్‌ డీఈ మల్లికార్జున్‌ అన్నారు. పెదనందిపాడు బ్రాంచి కెనాల్‌పై బుధవారం డీసీ ప్రెసిడెంట్‌ కల్లూరి కుసుమతో కలిసి ఇరిగేషన్‌ అధికారులు పర్యటించారు. నాగార్జున సాగర్‌ కాలువ ద్వారా వస్తున్న సాగు నీటిని మల్లాయపాలెం మేజర్‌ 15వ నంబరు వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట సబ్‌ డివిజన్‌ ఇరిగేషన్‌ డీఈ మాట్లాడుతూ పీబీసీ పరిధిలో ఇటీవల అవసరమైన పనులు చేయించామని చెప్పారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో ఉన్న నీటి లభ్యతను అనుసరించి విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఈ కోరారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రధాన రహదారిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి కట్టమూరివారి వీధిలోని రామాలయం వరకు బుధవారం రాత్రి పూలమాలను రామ నామంతో శోభాయాత్రగా తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు. అయోధ్యలో బాలరామ ప్రాణప్రతిష్ట 2వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌, నారాయణ సేన నగర సంకీర్తన సభ్యులు, ఇతర హిందూ బంధువులు కార్యక్రమం చేపట్టారు. నారాయణ సేన నగర సంకీర్తన కార్యనిర్వాహక సభ్యుడు అన్నం రమణ మాట్లాడుతూ అందరి కృషితో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుపుకొని రెండు సంవత్సరాల పూర్తయిందన్నారు. అనంతరం గాంధీ చౌక్‌లో ఉన్న వినాయక దేవాలయంలో శ్రీరామ చిత్రపటం ఉంచి పూజలు, భజనలు నిర్వహించారు. తర్వాత భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.

కోర్టు భవన స్థలాన్ని  పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌  1
1/3

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

కోర్టు భవన స్థలాన్ని  పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌  2
2/3

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

కోర్టు భవన స్థలాన్ని  పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌  3
3/3

కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement