
అట్టహాసంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహా మంజీరనాదం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం మేలట్టూర్ ఎన్.శ్రీకాంత్ నటరాజన్ (కేరళ)ను అక్కిరాజు మణి ప్రియ స్మారక సాత్రాజితి పురస్కారంతో, ఏలూరి జయశ్రీ, దంగేటి సాత్విక (తెలంగాణ)లను సంస్థ కార్యదర్శి కళారత్న డాక్టర్ కాజ వెంకటసుబ్రమణ్యం సత్కరించారు. మేలట్టూర్ శ్రీకాంత్ నటరాజన్ మేలట్టూ సంప్రదాయ నృత్యాన్ని, ఏటూరి జయశ్రీ కూచిపూడి నృత్యాన్ని, దంగేటి సాత్విక ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శించారు. వారి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమాలను మోదుగుల రవికృష్ణ, అక్కిరాజు శ్రీహరిబాబు, వెంకటగిరి నాగలక్ష్మి (కోశాధికారి), శ్రీఅలేఖ్యరావు పర్యవేక్షించారు.
సాత్విక నృత్యం

అట్టహాసంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం