బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పోలేరమ్మ తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు
కొండపాటూరు (ప్రత్తిపాడు): భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే జగజ్జననిగా విరాజిల్లుతున్న శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మ వారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం దేవాలయం సమీపంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ వారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా సిడిమాను..
అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో ప్రధాన ఘట్టం సిడిమాను ఊరేగింపు. ఒక పెద్ద దూలానికి చివరి భాగాన ఒక ఇనుప బోను ఏర్పాటు చేసి అందులో ఒక సిడిపోతును ఏర్పాటు చేశారు. సిడిమానుకు రైతులు పండించిన వివిధ రకాల పంటల దిగుబడులు, ధాన్యాలు కట్టి తమను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. సిడిమానును అమ్మ వారి స్వరూపంగా భావించి శిడిమాను బయలుదేరే సమయంలో సిడిపోతుపైకి భక్తులు జీడికాయలు విసురుతారు. ఆ కాయలు బోనులో ఉన్న మేకపోతుకు తాకితే తమ కోర్కెలు నెరవేరుతాయని అనాదిగా భక్తుల నమ్మకం. అనంతరం సిడిమానుకు గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం గుంటూరు, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట డిపోల నుండి ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
7
న్యూస్రీల్
వైభవోపేతంగా అమ్మవారి తిరునాళ్ల దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కనుల పండువగా సిడిమాను ఉత్సవం