
సివిల్స్లో విజయ్బాబుకు 681వ ర్యాంక్
ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా చేస్తున్న విజయ్బాబు
తెనాలి: సివిల్స్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు మరోసారి విజయం సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయనకు 681వ ర్యాంకు లభించింది. ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి మధుబాబు, రాజ్యలక్ష్మిల కుమారుడు విజయ్బాబు. 2021లోనే సివిల్స్ రాసి అప్పట్లో 682 ర్యాంకు సాధించారు. 22 ఏళ్ల వయసులోనే ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ ఆయన తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. ఐఏఎస్/ఐపీఎస్ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతూ సివిల్స్ రాశారు. ప్రస్తుతం 681 ర్యాంకుతో మళ్లీ మెరిశారు. ఈ పర్యాయం ఐపీఎస్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.