● వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన రౌండ్ టేబుల్ సమావేశం
● వైఎస్సార్సీపీ నాయకుల వెల్లడి
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూ రల్ : రాష్ట్రంలోని బలహీనవర్గాలకు అసలైన ఆత్మ బంధువు వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. 139 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయకే దక్కుతుందని కొనియాడారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్ టేబుల్ సమావేశాన్ని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్యాదవ్ అధ్యక్షతన, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మూరులోని పార్టీ కా ర్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును నాయకులంతా గుర్తు చేసుకున్నారు.


