విద్యుత్‌ ఓసీ ఉద్యోగుల సంఘ కార్యదర్శిగా తురగా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఓసీ ఉద్యోగుల సంఘ కార్యదర్శిగా తురగా

Sep 14 2026 5:24 AM | Updated on Sep 14 2026 5:24 AM

విద్యుత్‌ ఓసీ ఉద్యోగుల సంఘ కార్యదర్శిగా తురగా

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్‌ ఓసీ ఉద్యోగుల అసోసియేషన్‌ ఈపీడీసీఎల్‌ డిస్కం కార్యదర్శిగా నగరానికి చెందిన తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.అప్పలరాజు, తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తురగా రామకృష్ణ మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 లోపు సంస్థలో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు (పాత పెన్షన్‌ విధానానికి) మార్చడానికి కృషి చేస్తానని, అలాగే డిస్కం పరిధిలో ఉన్న సమస్యలపై సీఎండీతో చర్చించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను విద్యుత్‌ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నాయకులు, వివిధ కంపెనీల నాయకులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, డివిజన్‌ స్థాయి నాయకులు, ముఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement