దెందులూరు: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామ శివారు చింతలపాటివారిగూడెంలో తన భర్త ఇంటి వద్ద ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడని అతడి భార్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని చాట్ల తంబి (45)గా గుర్తించారు. తంబి తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యం అలవాటు, అనారోగ్యం కారణంగా దయ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.


