అక్రమ కేసులు, ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్లు చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు నడుపుతున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబు సర్కారు అక్రమ కేసును బనాయించి కారుమూరిని అరెస్ట్ చేసింది. బీసీ నాయకులపై పగబట్టారు.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు
మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ప్రజాస్వామికం. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. బలమైన సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నేతలను టార్గెట్ చేస్తున్నారు. అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు ప్రజాస్వామ్యంలో సరికాదు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలి.
– కొఠారు అబ్బయ్యచౌదరి,
దెందులూరు మాజీ ఎమ్మెల్యే


