శివ మండపానికి శిఖర ప్రతిష్ఠ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఏడేళ్ల క్రితం నిర్మించిన శివ మండపానికి ఆదివారం శిఖర కలశ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ నెల 9న ‘సాక్షి’లో ‘అలంకారప్రా యంగా మండపాలు’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. క్షేత్రంలోని పసరుకోనేరు ప్రాంతంలోని ధనుర్మాస మండపం, శివ మండపాలను పునర్నిర్మించినా ప్రారంభోత్సవం నిర్వహించలేదు. దీనిపై కథనం ప్రచురించగా శివ మండప శిఖర ప్రతిష్ఠకు చర్యలు తీసుకున్నారు. క్షేత్ర పాలకుని ఆలయంలో జరిగిన నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనలతో పాటు ఈ శివ మండపానికి శిఖర కలశ ప్రతిష్ఠను జరిపించారు. అయితే ధనుర్మాస మండపానికి శిఖర ప్రతిష్ఠపై స్పష్టత లేదు.
శివ మండపానికి శిఖర ప్రతిష్ఠ


