
ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలోని గోస్తనీ నదిలో వేంచేసియున్న పరశురామ ప్రతిష్ఠ శ్రీసప్త రామ కోటిలింగేశ్వరుడు సోమవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తారామేశ్వరం గ్రామంలో శ్రీఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు, సప్త రామ కోటి లింగేశ్వరులను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశం ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు దక్కుతుంది. రామేశ్వర క్షేత్రంలో సీతారాములు, లక్ష్మణుడు, పరశురాముడు, స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు ఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడులను దర్శించుకునే అవకాశం ఉన్నా.. నీటిలో ఉండే పరశురామ ప్రతిష్ఠ రామలింగేశ్వరుని దర్శించుకునే అవకాశం కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం ప్రారంభకావడంతో సోమవారం దేవాదాయశాఖ కోనేరులోని నీటిని పూర్తిగా తొలగించి స్వామిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సప్తరామ కోటేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తులకు దాతలు అన్నసమారాధనతోపాటు చక్రపొంగలి, పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి బారులు తీరి త్రిలింగాలను దర్శించుకున్నారు.
సోమవారం నుంచి ప్రారంభమైన సప్తకోటి రామలింగేశ్వరుడి దర్శనం
ఏడాదిలో వైశాఖ మాసంలోనే స్వామివారి దివ్య దర్శనం
బారులు దీరి త్రిలింగాలను దర్శించుకున్న భక్తులు

ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం

ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం

ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం