ద్వారకాతిరుమలలో గణేష్‌ శర్మకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ద్వారకాతిరుమలలో గణేష్‌ శర్మకు శిక్షణ

Apr 29 2025 7:07 AM | Updated on Apr 29 2025 7:07 AM

ద్వారకాతిరుమలలో గణేష్‌ శర్మకు శిక్షణ

ద్వారకాతిరుమలలో గణేష్‌ శర్మకు శిక్షణ

ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్‌ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్‌ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్‌ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన అన్నవరానికి చెందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కంచి పీఠం ఉత్తరాధికారిగా నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement