అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Apr 27 2025 12:53 AM | Updated on Apr 27 2025 12:53 AM

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

పెదవేగి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలివి. ఏలూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన తేటకాల పావని మొదటి కుమార్తె మీనాక్షికి పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన బాల సురేష్‌తో ఐదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి 19 నెలల ఆడబిడ్డ సంతానం ఉంది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం ఇవ్వగా మిగిలిన రూ.2 లక్షలు గురించి భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఈనెల 25వ తేదీ రాత్రి మీనాక్షి తల్లి పావనికి ఫోన్‌ చేసి చెప్పింది. శనివారం మీనాక్షి చనిపోయిందని చెప్పారని, కానీ ఆమె ఒంటిమీద దెబ్బలు ఉన్నాయని మృతురాలు తల్లి పావని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె రామకృష్ణ తెలిపారు. మీనాక్షి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement