క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం

Apr 21 2025 8:19 AM | Updated on Apr 21 2025 1:08 PM

క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం

క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం

తాడేపల్లిగూడెం (టీఓసీ): శశి విద్యా సంస్థల్లో క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం నేర్పిస్తామని శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్నారు. శశి తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో 7, 8, 9, 10, 10 ప్లస్‌ 1 విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్‌పై ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. దాదాపు 5 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సదస్సులో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను ఒత్తిడి చేయకుండా వారు ఏదైతే చేయగలుగుతారో ఆ కోర్సులు మాత్రమే చేయగలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సంస్థ వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ స్కూల్‌కి మార్కులు, ర్యాంకులు కోసమే కాకుండా విజ్ఞానం కోసం పంపాలని చెప్పారు. విద్యార్తులు ఫోన్‌ అవసరానికి వాడాలని, బానిస కాకూడదన్నారు. ఐఐటీ, నీట్‌పై తల్లిదండ్రులు అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. సదస్సులో డైరెక్టర్‌ మేకా క్రాంతి సుధ, క్యాంపస్‌ ఇన్‌చార్జి కె.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement