పెదవేగి : మోటార్సైక్లిస్టు చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన కొప్పాకగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మరీదు రాంబాబు (57శ్రీ శనివారం విజయరాయి నుంచి బొమ్ములూరు వెళుతుండగా కొప్పాకగూడెం వద్దకు వెళ్లేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
మామపై అల్లుడు హత్యాయత్నం
ఏలూరు టౌన్: మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు తంగెళ్ళమూడి కబడ్డీగూడెంకు చెందిన ధర్మవరపు శ్రీను కుమార్తె జ్యోతికి కొత్తపల్లి వెంగళరావుతో 18 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వెంగళరావు మద్యానికి బానిసై ఇటీవల భార్య జ్యోతిని ఇష్టారాజ్యంగా కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 14న భర్త వేధింపులు భరించలేక జ్యోతి తండ్రి ఇంటికి వచ్చింది. వెంగళరావు అక్కడకు రావడంతో మామ, అల్లుడి మధ్య వాగ్వివాదం చెలరేగి గొడవగా మారింది. వెంగళరావు తనతో తెచ్చుకున్న బ్లేడుతో మామ శ్రీనుపై దాడి చేశాడు. అనంతరం మరోసారి రాత్రివేళ వచ్చి తన భార్యను పంపాలంటూ గొడవకు దిగాడు. మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగగా అల్లుడు వెంగళరావు తనతో తెచ్చుకున్న కత్తితో మామ శ్రీనును పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో భార్య లక్ష్మి, మనవడు కొత్తపల్లి నాగు శ్రీనుని ఏలూరు జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి ఆసుపత్రిలోని పోలీస్ ఔట్పోస్టుకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్లు ఢీకొని నలుగురికి గాయాలు
ఉంగుటూరు: జాతీయరహదారిపై శనివారం కై కరం నుంచి భీమడోలు వెళుతున్న రెండు బైకులు ఢీకొని నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల ప్రకారం ముందు వెళుతున్న బైక్ను ఓవర్టేక్ చేస్తుండగా రెండు బైక్ల హేండిళ్లు లింక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులది కూరెళ్లగూడెం, పత్తేపురం గ్రామాలు అని తెల్సింది. క్షతగాత్రులు కె.సుగుణ (38), కె.శాంతిరాజు (39), జాన్సి (46), సాయికిరణ్(24) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


