మూడు అడుగులు పైకి
ఆధునిక సాంకేతికత సాయంతో ఇప్పుడు ఇళ్లను పైకి లేపడం కూడా సాధ్యమైంది. ఆకివీడు మాదివాడలో అత్తిలి శ్రీనుకు చెందిన భవనాన్ని 2000లో నిర్మించారు. అప్పటి రోడ్డు లెవల్కు భవనం నిర్మించారు. ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణంతో భవనం పల్లం అవడంతో వర్షపు నీరు లోపలికి వస్తుంది. దీంతో యజమాని శ్రీను బీహార్కు చెందిన కార్మికుల సాయంతో భవనాన్ని ఎత్తు చేసేందుకు నిర్ణయించారు.
మూడు అడుగుల ఎత్తుకు భవనం పైకి లేపి, కింద భాగంలో కాంక్రీట్ వేస్తారు. ఈ విధంగా పైకి లేపి ఎత్తు చేసినందుకు అడుగుకు రూ.600 ఖర్చు అవుతుందని చెప్పారు. భవనం పైకి లేపేందుకు పునాదులలో జాకీలు అమర్చారు.
– ఆకివీడు