బాధల బడిబాట! | - | Sakshi
Sakshi News home page

బాధల బడిబాట!

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

చాగల్లు: విద్యార్థులే కూలీలుగా మారిన ఘటన వాడపల్లి చంద్రవరం రహదారిలో చోటుచేసుకుంది. కూటమి ప్రభత్వం వచ్చిన తరువాత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాడపల్లి, చంద్రవరం రహదారిలో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు గుంతలో దిగపడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులే రాళ్లు తీసుకువచ్చి టైర్‌ కింద వేసి బస్సు కదిలేలా చేశారు. అధికారులు స్పందించి ఈ పుంత రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

22 నుంచి వనదుర్గ జాతర

అన్నవరం: రత్నగిరి వనదేవత శ్రావణమాస జాతర మహోత్సవాలు 22వ తేదీ శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకు సాగనున్నాయి. 22న అమ్మవారిని బాల త్రిపురసుందరిగా, 23 సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25 న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శనాలు కల్పించనున్నారు. 28న అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement