మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ. స్పోర్ట్స్ కోటా పేరిట జీఓలు మార్చేసి, టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వసూలు చేశారు. సీబీఐ విచారణతోనే ఈ స్కామ్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. అవకతవకలు జరగడం వల్లే విచారణకు వెనుకాడుతున్నారు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్


