పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 39 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 39 ఫిర్యాదులు

Apr 29 2025 12:18 AM | Updated on Apr 29 2025 12:20 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రెస్సల్‌ సిస్టం(పీజీఆర్‌ఎస్‌)కు 39 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో నేరుగా జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎల్‌.అర్జున్‌, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement