తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన

Apr 28 2025 12:10 AM | Updated on Apr 28 2025 12:10 AM

తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన

తిరుమలలో అవగాహన సదస్సుకు మంచి స్పందన

రాజమహేంద్రవరం రూరల్‌: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు సుమారు 15వేలమంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలంటే స్కూల్‌ స్థాయి నుంచే ఐఐటీ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను వారికి అందించాలి. అప్పుడే వారు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కి దూరంగా ఉంచాలని అన్నారు. స్కూల్‌ స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ అవసరంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్‌ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. ప్రతి తల్లి తమ పిల్లలకు విలువలతో కూడిన విద్యను వారికి అందించే ప్రయత్నం చేయాలని తెలిపారు. తిరుమల విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు పెండ్యాల బుచ్చిబాబు, ఏఎన్‌వీ సత్యనారాయణ(నాని మాస్టారు) పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement