
లోక్ అదాలత్ వాయిదా
● జూలై 5న నిర్వహణ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
గంధం సునీత
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్):
వచ్చే నెల 10న నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ను జూలై 5వ తేదీకి వాయిదా వేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో జిల్లా న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జూలై 5న జిల్లావ్యాప్తంగా జరగనున్న లోక్ అదాలత్లో అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎకై ్సజ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బి.పద్మ, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు సీహెచ్ లావణ్య, ఎం.కృష్ణకుమారి, ఎస్కేడీవీ ప్రసాద్, పీఎన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
డీపీఆర్ఓగా బాలకృష్ణ
రాజమమహేంద్రవరం సిటీ: జిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్ఓ)గా వై.బాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, కలెక్టర్ పి.ప్రశాంతిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి, పరిపాలనా యంత్రాంగానికి, మీడియాకు మధ్య వారధిగా డీపీఆర్ఓ కీలక పాత్ర పోషించాలని అన్నారు. బాలకృష్ణ ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై , జిల్లాలో నియమితులవడంపై అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లడంలో కీలక బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులతో సమన్వయం సాధించడం ద్వారా లక్ష్య సాధన సాధ్యమవుతుందన్నారు. నూతన డీపీఆర్ఓ బాలకృష్ణకు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కరరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ కె.తిలక్ కుమార్, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి సీహెచ్ శ్రీనివాస్, డివిజనల్ పీఆర్ఓ ఎం.లక్ష్మణాచార్యులు తదితరులు అభినందించారు.

లోక్ అదాలత్ వాయిదా