టెన్త్‌లో విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో విద్యార్థుల సత్తా

Apr 24 2025 12:27 AM | Updated on Apr 24 2025 12:27 AM

టెన్త్‌లో విద్యార్థుల సత్తా

టెన్త్‌లో విద్యార్థుల సత్తా

జిల్లాలో పాఠశాలల

వారీగా ఉత్తీర్ణత ఇలా...

పాఠశాల హాజరైన పాసైన ఫెయిలైన

వారు వారు వారు

ఎయిడెడ్‌ 704 529 175

బీసీ వెల్ఫేర్‌ 109 106 3

ప్రభుత్వ 692 504 188

ట్రైబల్‌ వెల్ఫేర్‌ 36 33 3

మున్సిపల్‌ 1,425 1,078 347

ప్రైవేటు 10,102 9,871 231

ఏపీ ఆర్‌ఈఎస్‌ 83 83 0

సోషల్‌ వెల్ఫేర్‌ 368 359 9

జెడ్పీ 9,869 8,015 1,854

సాక్షి, రాజమహేంద్రవరం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా సత్తా చాటింది. 87.99 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. గతేడాది ఫలితాల్లో 83.20 శాతం ఫలితాలతో 21వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది గణనీయ ప్రగతి సాధించి, 6వ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాయన్న సమాచారం అందిన వెంటనే వెబ్‌సైట్ల బాట పట్టారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఫలితాల అన్వేషణలో పడ్డారు. తమ పిల్లలకు ఫస్ట్‌ క్లాస్‌, ఉత్తమ మార్కులు సాధించారంటూ తమ ఆనందాన్ని బంధువులు, పిల్లలతో పంచుకున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

87 శాతం ఉత్తీర్ణత

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 23,388 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యారు. అందులో 20,578 మంది పాసయ్యారు. 2,810 మంది ఫెయిలయ్యారు. బాలికలు 10,268 (89.97 శాతం), బాలురు 10,310 (86.10 శాతం) మంది పాసైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 72.83 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటు పాఠశాలల్లో 97.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 112 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మిగిలిన వాటిల్లో సైతం మంచి ఫలితాలు వచ్చాయి. 95.67 శాతంతో అనపర్తి మండలం మొదటి స్థానంలో ఉండగా.. 76.7 శాతం ఉత్తీర్ణతతో చాగల్లు మండలం చివరి స్థానంలో ఉంది.

మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లోనూ...

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో సైతం ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం మెరుగ్గా ఉంది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 75.14 శాతం, బీసీ వెల్ఫేర్‌ 97.25, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో అత్యధికంగా 91.67 శాతం, మున్సిపల్‌ 75.65 శాతం, ఏపీ ఆర్‌ఈఎస్‌ 100 శాతం, సోషల్‌ వెల్ఫేర్‌లో 97.55 శాతం, జిల్లా పరిషత్‌ 81.21 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

16,846 మందికి ఫస్ట్‌క్లాస్‌

పదో తరగతి ఫలితాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు మొదటి తరగతిలో పాసయ్యారు. 23,338 మంది పరీక్ష రాయగా.. 20,578 మంది పాసయ్యారు. అందులో 16,846 మంది మొదటి తరగతి, 2,411 మంది ద్వితీయ, 1,321 మంది తృతీయ తరగతిలో పాసయ్యారు.

గత ప్రభుత్వ విధానాలతో..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అమ్మఒడి పథకంతో క్రమం తప్పకుండా ఆర్థిక సాయం చేపట్టింది. పాఠశాలలు తెరిచే సమయానికి జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా స్కూల్‌ బ్యాగులు, బూట్లు, బెల్టు ఇలా విద్యార్థికి అవసరమైన అన్ని వసతులు కల్పించింది. నాడు–నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పాఠశాలల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించింది. ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించే వెసులుబాటు కల్పించడంతో విద్యార్థులు విద్యపై దృష్టి సారించే అవకాశం దక్కింది. పక్కా ప్రణాళికతో విద్యాబోధన, అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించడం ఎంతగానో ఉపయుక్తంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణత శాతంలో

జిల్లా గణనీయ ప్రగతి

ఊతమిచ్చిన గత

ప్రభుత్వ విధానాలు, పథకాలు

పది పరీక్షలు రాసిన విద్యార్థులు

23,388

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

20,578

ఫెయిల్‌ : 2,810

ఉత్తీర్ణత శాతం: 87.99

ఫస్ల్‌ క్లాస్‌: 16,846

సెకండ్‌ క్లాస్‌ :

2,411

థర్డ్‌ క్లాస్‌ : 1,321

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement