పత్రికా స్వేచ్ఛను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను కాపాడండి

Apr 24 2025 12:27 AM | Updated on Apr 24 2025 12:27 AM

పత్రికా స్వేచ్ఛను కాపాడండి

పత్రికా స్వేచ్ఛను కాపాడండి

కొవ్వూరు: ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరు ప్రెస్‌ రిపోర్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం ఈ మేరకు ఆర్డీవో రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, కార్యాలయాలపై దాడులను నియంత్రించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఏపీయుడబ్ల్యూజే) అనుబంధ సంస్ధ అయిన కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నల్లా స్వామి నాయుడు, ఉపాధ్యక్షుడు ఎస్‌వీవీ ఎస్‌ ప్రసాద్‌,గౌరవ అధ్యక్షుడు జీవీవీ సత్యనారాయణ, సంయుక్త, సహాయ కార్యదర్శులు జి.ఎర్రన్న, జి.రవికుమార్‌, మాజీ ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి ఏఎస్‌ ప్రకాష్‌,బి.భాను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement