
కోతకొచ్చిన కష్టాలు
ఫ నత్తనడకన దాళ్వా వరి కోతలు
ఫ కూలీలు దొరకక, యంత్రాలు లేక
ఇబ్బందులు
ఫ ఇప్పటి వరకూ జరిగింది 48.3 శాతమే..
ఫ రైతుల బాధలు పట్టించుకోని ప్రభుత్వం
పెరవలి: ప్రస్తుత రబీలో జిల్లా రైతులకు నాట్ల సమయంలో మొదలైన కష్టాలు కోతల వరకూ వచ్చినా తీరడం లేదు. ఏటా దాళ్వా వరి సాగుకు నీటి ఎద్దడి ఉంటుందని తెలిసినా ప్రభుత్వం సరైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కీలకమైన దశలో నీరందక శివారు వరి రైతులు నానా ఇక్కట్లూ ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా మెరక పొలాల రైతులకు ఇంజిన్లు సమకూర్చి, కొన్నిచోట్ల నీటి తోడకాలు చేసేవారు. మరికొన్నిచోట్ల డీజిల్ అందించి, సాగునీరు తోడుకునేందుకు సహకరించేవారు. ఇంకొన్నిచోట్ల మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేసి సాగునీరు అందేలా చర్యలు చేపట్టేవారు. ఈసారి కూటమి ప్రభుత్వ ఏలుబడిలో అటువంటి చర్యలు మచ్చుకై నా లేవని రైతులు చెబుతున్నారు. దీంతో, ఖర్చు ఎక్కువైనా బోర్లతో సాగునీరు అందించి పంట పండించారు. ఇప్పుడు వరి కోతల తరుణం వచ్చింది. కీలకమైన ఈ సమయంలో కోతలకు ఇటు కూలీలు దొరకక, అటు వరికోత యంత్రాల అవసరమైనన్ని లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
28,287 హెక్టార్లలో..
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది దాళ్వా వరి దిగుబడులు 50 నుంచి 60 బస్తాల వరకూ వస్తున్నాయి. ఇది రైతులకు సంతోషంగానే ఉన్నా.. ఆ పంటను దక్కించుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులతో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో నిండుగా పండిన పంట దక్కుతుందో లేదోనని వారు గుబులు చెందుతున్నారు. మరోవైపు కూలీలతో కోతలు కోయించడానికి సమయం చాలక.. వరి కోత యంత్రాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా జిల్లాలో వరి కోతలు ఇప్పటి వరకూ సగం కూడా పూర్తి కాలేదు. జిల్లావ్యాప్తంగా రబీ వరి సాగు 60,042 హెక్టార్లలో జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 58,586 హెక్టార్లలో జరిగింది. ఇప్పటి వరకూ ఇందులో 28,287 హెక్టార్లలో అంటే 48.3 శాతం మాత్రమే వరి కోతలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి వరి కోతలు 80 శాతం పైగా పూర్తయ్యేవి. రైతులు మూడో పంటకు కూడా సిద్ధమయ్యేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
కోత యంత్రాల అద్దెకు రెక్కలు
రైతులు వారం రోజులుగా వరి కోతలు ముమ్మరంగా చేపడుతున్నారు. అయితే, అవసరమైన స్థాయిలో వరి కోత యంత్రాలు లేకపోవడం వారికి సమస్యగా మారింది. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేశారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి కోత యంత్రాలను కమీషన్లు, అధ్దె ప్రాతిపదికన తీసుకువచ్చి, రైతుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో వరి కోత యంత్రాలు 240 ఉండగా ఇతర జిల్లాల నుంచి మరో 260 తీసుకుని వచ్చారు. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కోత యంత్రాల యజమానులు ఒక్కసారిగా అద్దెలు పెంచేశారు. దాళ్వా వరి కోతల ప్రారంభంలో ఎకరానికి, గంటకు రూ.2,500 చార్జి చేసేవారు. ప్రస్తుతం దీనిని రూ.3 వేలకు పెంచేశారు. అదేమని రైతులు అడిగితే ఎవరైనా తక్కువకు వస్తే కోయించుకోండంటూ బదులిస్తున్నారు. దీంతో, చేసేది లేక రైతులు కోత యంత్రాల యజమానులు, దళారులు చెప్పిన రేటు చెల్లించుకుని, కోతలు కోయిస్తున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో యంత్రాలతో సగటున రోజుకు 5 వేల నుంచి 6 వేల ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోతలు ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. కోతలు పూర్తయ్యేలోగా పంట వర్షార్పణం కాకుండా చూడాలంటూ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
మెషీన్లు లేక..
నానా కష్టాలూ పడి దాళ్వా వరి సాగు చేసినా సమయానికి కోత మెషీన్లు అందుబాటులో లేవు. దీంతో, కోతలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఇతర జిల్లాల నుంచి రావటంతో వేగంగా జరుగుతున్నాయి.
– కొమ్మిశెట్టి వెంకటస్వామి, రైతు, కానూరు, పెరవలి మండలం
ఖర్చు ఎక్కువ.. మిగులు తక్కువ
గతంలో కోత మెషీన్కు ఎకరానికి, గంటకు రూ.2,500 తీసుకునే వారు ఇప్పుడు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. మెషీన్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాళ్వా పంట పండినా ఖర్చులు అధికమవడంతో మిగులు తక్కువగా ఉంటుంది.
– సాధనాల ఏడుకొండలు,
వరి రైతు, కానూరు, పెరవలి మండలం
జిల్లాలో మండలాల వారీగా వరి సాగు, కోతల వివరాలు (హెక్టార్లలో)
సాగు కోతలు
మండలం విస్తీర్ణం జరిగిన శాతం
విస్తీర్ణం
రాజమహేంద్ర 1,989 1,152 88.7
వరం రూరల్
కడియం 2,027 800 39.5
రాజానగరం 3,229 2,360 73.1
అనపర్తి 3,502 1,620 46.3
బిక్కవోలు 5,407 800 14.8
కోరుకొండ 2,251 1,125 50.0
గోకవరం 1,989 719 36.1
సీతానగరం 4,443 2,500 56.3
రంగంపేట 849 460 54.2
చాగల్లు 3,307 2,000 60.5
దేవరపల్లి 2,914 990 34.0
గోపాలపురం 2,221 686 30.9
కొవ్వూరు 4,436 3,202 72.2
నిడదవోలు 6,970 5,650 81.1
పెరవలి 3,305 1,032 31.2
తాళ్లపూడి 3,602 1,886 51.8
ఉండ్రాజవరం 4,783 810 16.9
నల్లజర్ల 2,133 564 26.4

కోతకొచ్చిన కష్టాలు

కోతకొచ్చిన కష్టాలు

కోతకొచ్చిన కష్టాలు